India Corona: ల‌క్ష దిగువ‌కు క‌రోనా కేసులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. సుమారు 68 రోజుల త‌ర్వాత సోమ‌వారం కేసుల సంఖ్య ల‌క్ష దిగువ‌కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో (సోమవారం) దేశంలో కొత్త‌గా 86,498 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 2123 మంది మృతిచెందారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 3,51,309 కి చేరింది.

గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,82,282 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో 13,03,702 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.