AP: గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి
విజయవాడ (CLiC2NEWS): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎపిలో వారం రోజుల పర్యటనలో భాగంగా శనివారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా గవర్నర్ బిశ్వబూషణ్ హరిచందన్, డిజిపి గౌతమ్ సవాంగ్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. అక్కడ నుండి ఉప రాష్ట్రపతి ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్కి బయలుదేరారు. ఈ సాయంత్రం స్వర్ణభారత్ ట్రస్టులో రైతు నేస్తం పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.