Hyderabad: బస్సు, బైకు ఢీ: వ్యక్తి మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని అబిడ్స్లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అబిడ్స్ సర్కిల్ వద్ద బైకు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో మోటారు సైకిల్పై వెళ్తున్న వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.