TSRTC: శబరిమల భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌!

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్టీసీ శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ చెప్పంది. అయ్యప్ప స్వాములు, భ‌క్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ తక్కువ ఛార్జీలతో శబరిమలకు స్పెషల్‌ బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

వివ‌రాలు..

  • సూపర్‌ లగ్జరీ బస్సులు (36 సీట్లు) కిలోమీటర్‌కు రూ. 48.96 చొప్పున
  • డీలక్స్‌ బస్సులు (40 సీట్లు) కిలోమీటర్‌ రూ. 47.20 చొప్పున
  • డీలక్స్‌ బస్సులు (48 సీట్లు) రూ.56.64 చొప్పున
  • ఎక్స్‌ప్రెస్ బస్సులు (49 సీట్లు ) రూ. 52.43 చొప్పున అద్దెకు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

ఈ బస్సులన్నింటికీ గంటకు రూ. 300 చొప్పున వెయిటింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.