రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కొవిడ్ పాజిటివ్..
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అనేక మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్గా నిర్థారణయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నానని, తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.