‘జగనన్న చేదోడు పథకం’ రెండో ఏడాది రూ. 285.35కోట్లు విడుదల..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం రెండో సంవత్సరం నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన జగనన్న చేదోడు పథకం కింద ఈ సంవత్సరం లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 285.35 కోట్లు ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. షాపులున్న 1,46,103 మందికి టైలర్లకు రూ. 146.10 కోట్లు, 98,439 మంది రజకులకి రూ 98.44 కోట్లు, 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 40.81 కోట్లు సాయం అందిస్తున్నామని తెలిపారు.