ఎపి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిపి మంత్రి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వైఎస్ఆర్ సిపి ఎంపి విజయసాయి రెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షడు ఆర్. కృష్ణయ్య, అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిశీలించి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బలహీన వర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని, సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారని తెలిపారు.