నామినేష‌స్లు దాఖ‌లు చేసిన వైఎస్ ఆర్ సిపి రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): రాజ్య‌స‌భ స్థానాల‌కు వైఎస్ ఆర్‌సిపి న‌లుగురు అభ్య‌ర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. వైఎస్ ఆర్‌సిపి పార్ల‌మెంటరీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి,  జాతీయ ఉద్య‌మ నేత ఆర్‌. కృష్ణ‌య్య, సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది నిరంజ‌న్ రెడ్డి, బీద మ‌స్తాన్ రావు, బుధ‌వారం అమ‌రావ‌తిలో రిట‌ర్నింగ్ అధికారి, శాస‌న‌మండ‌లి ఉప కార్య‌ద‌ర్శి పివి సుబ్బారెడ్డికి నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేశారు. ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి, మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి వెళ్లి నామినేష‌న్లు వేశారు. నామినేష‌న్ తో పాటు బాఫారం, అఫిడ‌విట్‌, సెక్యూరిటీ డిపాజిట్ల‌ను ఆర్వోకి అంద‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.