జిఓ 80ఎ ర‌ద్దు చేయాలంటూ.. హైవేపై రైతుల నిర‌స‌న‌

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): భూసేక‌ర‌ణ జిఓ 80ఎ ర‌ద్దు చేయాలంటూ వ‌రంగ‌ల్ జిల్లా రైతులు నిర‌స‌న‌కు దిగారు. హ‌నుమ‌కొండ‌-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు. జిఓను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని నినాదాలు చేశారు. రైతుల నిర‌స‌న‌లో బిజెపి, కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష నేత‌లు పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు పెద్ద సంఖ్య‌లో మోహ‌రించారు. రైతుల నిర‌స‌న‌తో హ‌నుమ‌కొండ‌-హైద‌రాబాద్ హైవేపై భారీ సంఖ్య‌లో వాహ‌నాలు నిలిచిపోయాయి.

Leave A Reply

Your email address will not be published.