దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఏడుగురు మృతి
మాచర్ల (CLiC2NEWS): రెంటచింతలలో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. వారంతా మరికొద్ది నిమిషాల్లో వాళ్ల ఇంటి వద్ద దిగిపోవడానికి సిద్ధమవుతుండగా.. ఆగిఉన్న లారీని బలంగా ఢీకొని వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో దొర్లుకుంటూ రోడ్డు మీద పడిపోయారు.
శ్రీశైలం దర్శనానికి టాటా ఏస్లో కుటుంబసభ్యులంతా వెళ్లి.. దర్శనం తర్వాత తిరిగి వస్తున్న వారి వాహనం రెంటచింతల పొలిమేరలోకి రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మరో ముగ్గురు మరణించారు.