మాజి ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న..
ఢిల్లీ (CLiC2NEWS): మాజి ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మాజి ప్రధానులు పివి నరసింహారావు, చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను దేశ అత్యున్నత పురస్కారం అందించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదకగా వెల్లడించారు. ఇటీవల బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానికి భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా ప్రకటనతో ఈ సంవత్సరం మొత్తం ఐదుగురిని భారతరత్న పురస్కారం వరించింది.