గ్రూప్-1 అభ్యర్థుల వయోపరిమితి పెంపు..! సిఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలో గ్రూప్-1 నిర్వహిస్తామని శాసనసభలో ప్రకటించారు. అంతేకాకుండా పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నారని.. త్వరలో పోలీసు శాఖలో 15 వేల ఆద్యోగ నియామకాలు చేపడతామన్నారు. యూనివర్సిటీలలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని సిఎం తెలిపారు.