అచ్యుతాపురం సెజ్ ప్ర‌మాద బాధితుల కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం

విశాఖ (CLiC2NEWS): అచ్యుతాపురం సెజ్‌లో రియాక్ట‌ర్ పేలి 17 మంది మృతి చెందారు. 36 మందికి పైగా గాయాల‌య్యాయి. విశాఖ‌ప‌ట్ట‌ణం మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ క్ష‌త‌గాత్రుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు. మృతుల కుటుంబాల‌కు రూ. కోటి చొప్ప‌న ప‌రిహారం అంజేస్తామ‌న్నారు. తీవ్ర‌గాయాలైన వారికి రూ. 50 ల‌క్ష‌లు, స్వ‌ల్ప‌గాయాలైన వారికి రూ.25 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం అంద‌జేస్తామ‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. గ‌త ఐదేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు నాశ‌న‌మ‌య్యాయ‌ని.. దాని ప‌ర్య‌వ‌సాన‌మే ఈ ప్ర‌మాద‌మ‌న్న సిఎం ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో ఇదే చివ‌రిది కావాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.