నా లాగా అర్ధం కాని చదువు వద్దు.. ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
హనుమకొండ (CLiC2NEWS): హనుమకొండ నయీంనగర్లోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంపిసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానకి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తల్లికి ఓ లేఖ రాసింది. ఆ లేఖ.. ప్రస్తుతం విద్యాలయాల్లో చదువులు ఎలా ఉన్నాయో.. విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతోంది. కాలేజ్లో చెపుతున్న చదువు అర్ధం కాక తాను ఎంతగా ఇబ్బందిపడిందో తెలుస్తుంది. తాను ఎంత కష్టపడినా కూడా మార్కులు రావడంలేదని ఆవేదన చెందింది. మార్కులు తక్కువచ్చినందుకు కన్న తల్లిదండ్రులుగా మీరు కూడా తట్టుకోలేరని భావించింది. ఈ చదువు తనతో కావడం లేదని బలవన్మరణానికి పాల్పడింది.
తమ కుమార్తె కోరుకున్నదే తల్లిదండ్రులు ఒప్పుకుని ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేశారు. కానీ.. ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లిని మాత్రం ఇలాంటి అర్ధంకాని చదువు వద్దని చెప్పింది. కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఎవరినైనా అడిగి జాయిన్ చేయండని చెప్పింది.
[…] […]
I think the admin of this site is actually working hard for his website, since here every information is quality based data.
I am sure this article has touched all the internet people, its really really
nice article on building up new web site.
Everyone loves what you guys tend to be up too.
This kind of clever work and exposure! Keep
up the great works guys I’ve incorporated you guys to my personal blogroll.
[…] […]