రానున్న మూడు రోజులు జాగ్రత్త.. హైడ్రా
హైదరాబాద్ (CLiC2NEWS): రానున్న మూడు రోజులు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా (HYDRA) హెచ్చరించింది. హైదరాబాద్లో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలో భారీ వర్ష సూచన ఉన్నట్లు సమాచారం. అత్యవసరమైతే తప్ప నగర ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు సైతం ఇళ్లలోనే ఉండి వర్క్ చేసుకోవాలిన సూచించారు. విద్యాలయాలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
తప్పక చదవండి: ఢిల్లీ-వాషింగ్టన్: ఎయిరిండియా సర్వీసులు రద్దు..
[…] […]