వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన గ్యాస్ సిలెండర్ల లారీ..
Mumbai : దేశ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు అక్కడి వరద నీరు అధికంగా చేరకుంటుంది. వరద ప్రవాహానికి గ్యాస్ సిలిండర్లు ఉన్న ఓ లారీ కొట్టుకుపోయింది. జబల్ పూర్ లోని పారియల్ నదికి వరద నీరు అధికమవడంతో ప్రవాహం పెరిగి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బరేలా-కుందమ్ ప్రాంతంలో ని పారియల్ నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ సహా లారీలోని మరో వ్యక్తి నీటిలో మునిగిపోకుండా తప్పించుకున్నారు.