రాములోరి క‌ల్యాణం ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారానికి అనుమ‌తివ్వండి.. మంత్రి కొండా సురేఖ

హైద‌రాబాద్ (CLiC2NEWS): భ‌ద్రాద్రి సీతార‌మాచంద్ర‌మూర్తి క‌ల్యాణోత్స‌వం ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారానికి అనుమ‌తివ్వాల‌ని మంత్రి కొండా సురేఖ ఇసి లేక రాశారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున్ క‌ల్యాణం లైవ్‌కి ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలో సీతారాముల క‌ల్యాణం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి ఎన్నిక‌ల కోడ్ నుండి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు. 40 ఏళ్లుగా క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం అవుతుంద‌ని , ఆల‌య విశిష్ట‌త‌, సంప్ర‌దాయాల‌ను లేఖ‌లో వివ‌రించారు. భ‌ద్రాద్రిలో 17 వ తేదీన సీతారాముల క‌ల్యాణం, 18న ప‌ట్టాభిషేకం వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.