ఎమ్మెల్సీ క‌విత‌కు ఈ నెల 23 వ‌ర‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డి..

ఢిల్లీ (CLiC2NEWS): మ‌ద్యం కేసులో ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి తిహాడ్ జైలుకు వెళ్ల‌నున్నారు. సిబిఐ అధికొరులు సోమ‌వారం రైజ్ అవెన్యూ లోని సిబిఐ ప్ర‌త్యేక కోర్టులో క‌విత‌ను హాజ‌రుప‌రిచారు. న్యాయ‌స్థానం ఆమెకు 9 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డి విధించింది. 14 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డి విధించాల‌ని సిబిఐ కోర‌గా.. కోర్టు 9 రోజుల‌కు అనుమ‌తించింది. దీంతో ఆమెను ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు తిహాడ్ జైలులో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.