AP Corona: 23,160 కొత్త కేసులు.. 106 మృతులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బుధ‌వారం సాయంత్రం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరుకొంది.

తాజాగా 24,819 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736గా ఉంది.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 106 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 9,686కు పెరిగింది.

ఇవాళ అత్య‌ధికంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 17 మంది మృతిచెంద‌గా, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నంలో 11 మంది చొప్పున‌, తూర్పుగోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో 9 మంది చొప్పున‌, అనంత‌ర‌పురం, కృష్ణా, చిత్తూరు, శ్రీ‌కాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున‌, గుంటూరులో ఏడుగురు, క‌ర్నూలులో ఐదుగురు చొప్పున మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.