అద్వానికి భార‌త‌ర‌త్న పుర‌స్కారం..

ఇంటికి వెళ్లి అంద‌జేసిన రాష్ట్రప‌తి

ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో అత్యున్న‌త పౌర‌పుర‌స్కారం భార‌త‌ర‌త్న అవార్డుల ప్ర‌ధానోత్స‌వం శ‌నివారం నిర్వ‌హించారు. మాజి ఉప‌ప్ర‌ధాని లాల్ కృష్ణ అద్వానికి భార‌తర‌త్న అవార్డును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఆనారోగ్యంగా ఉండ‌టంతో అవార్డు ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌రుకాలేక‌పోయారు. దీంతో ఆయ‌న నివాసానికే వెళ్లి ఆదివారం పుర‌స్కారాన్ని అంజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి, ఉప రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌, మాజి ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయ‌డు హాజ‌ర‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.