BUDGET-2023: గృహ కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): 2023-24 ఆర్ధిక సంవ‌త్స‌రానికి గానూ కేంద్ర బ‌డ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బుధ‌వారం పార్ల‌మెంటులో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో కొత్త‌గా ఇల్లునిర్మించుకోవాల‌నుకునే వారికి మోడీ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. పిఎం ఆవాస్ యోజ‌న కింద ఆ ప‌థ‌కానికి.. 2022-23 బ‌డ్జెట్‌లో భారీగా నిధుల‌ను పెంచింది. గ‌త బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పిఎం ఆవాస్ యోజ‌న‌కు రూ. 48 వేల కోట్లు కేటాయించారు. కాగా ఈ సారి 2022-23 బ‌డ్జెట్‌లో 66 శాతం పెంచారు. మొత్తం రూ. 79 వ‌లే కోట్లు కేటాయించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ‌డ్డీ రేట్లు పెరిగిన సంద‌ర్భంలో ఇళ్ల కొనుగోలు దారుల‌కు ఇది భారీ ఊర‌ట క‌లిగించే అంశం

మ‌రిన్ని బ‌డ్జెట్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి:

BUDGET-2023: లోక్‌స‌భ ముందుకు కేంద్ర బ‌డ్జెట్‌

BUDGET-2023: రైల్వేల‌కు రూ. 2.40 ల‌క్ష‌ల కోట్లు

Leave A Reply

Your email address will not be published.