కర్ణాట‌క ఫ‌లితాల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్‌..

కాంగ్రెస్ పార్టీ చ‌రిత్రలో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రోజు..

బెంగ‌ళూరు (CLiC2NEWS): క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 224 స్థానాల్లో 136 సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీ కైవ‌సం చేసుకుంది. బిజెపి 65 స్థానాలు ద‌క్కించుకుని రెండ‌వ స్థానంలో నిలిచింది. ఇక జెడిఎస్ కేవ‌లం 19 సీట్లు మాత్ర‌మే గెలుచుకుంది. మైసూరు ప్రాంతంలో 14 సీట్లు వ‌చ్చాయి. ఇత‌రులు 4 స్థానాలు ద‌క్కించుకున్నారు.

కార్ణాట‌క ఎన్నిక‌ల్లో అపూర్వ విజ‌యాన్ని అందించార‌ని కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎఐసిసి కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లో ఈ రోజు చిర‌స్మర‌ణీయ‌మ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ర‌ణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. పార్టీని గెలిపించినందుకు ఆయ‌న కార్ణాట‌క ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

కాంగ్రెస్ శ్రేణుల గెలుపు సంబ‌రాలు (ఫొటోలు)

Leave A Reply

Your email address will not be published.