శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’..
హైదరాబాద్ (CLiC2NEWS): దర్శకుడు శేఖర్ కమ్ము
ల ధనుష్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ను ఖరారు చేసి.. పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ధనుష్ మాసిన వస్త్రాలతో, గుబురు గడ్డంతో గుడి మందు కనిపిస్తాడు. ధనుష్ నటిస్తున్న 51వ చిత్రమిది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్ 50వ చిత్రం రాయన్.. ఈచిత్రానికి ఆయనే దర్శకత్వం చేస్తున్నారు.