రామ్‌చ‌ర‌ణ్‌తో జ‌త‌క‌ట్ట‌నున్న జాన్వీక‌పూర్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీక‌పూర్ జంట‌గా వెండితెర‌పై బుచ్చిబాబు డైరెక్ష‌న్‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడుగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ప‌ట్టాలెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి చిత్రంలో చిరంజీవి-శ్రీ‌దేవి జంట అభిమానుల‌ను ఎంత‌గా అల‌రించారో.. ఇపుడు వారి వార‌సులు జోడీగా తెర‌పై సంద‌డి చేయ‌బుతున్నార‌న్న విష‌యం స్వ‌యంగా బోనీక‌పూర్ వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం.

జాన్వీ ఇప్ప‌టికే ఎన్‌టిఆర్‌తో క‌లిసి దేవ‌ర లో న‌టిస్తోంది. ఇపుడు రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని ఆమె తండ్రి తెలిపారు. త‌న న‌ట‌న‌, భాష‌ను పెంచుకునేందుకు వీలు కుదిరిన‌పుల్లా జాన్వీ తెలుగు సినిమాలు చూస్తొంద‌న్నారు. ఎన్‌టిఆర్, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రుతోనూ క‌లిసి నటించే అవ‌కాశం వ‌చ్చింద‌ని.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.