జ‌గిత్యాల ర‌హ‌దారిలో కార్మికుల పూరిళ్లు ద‌గ్ధం..

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): క‌రీంన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. సుభాష్‌న‌గ‌ర్‌లో కార్మికుల పూరిళ్లకు నిప్పంటుకుని పెద్దెత్తున మంట‌లు వ్యాపించాయి. ఈ ఘ‌ట‌న‌లో 5 గ్యాస్ సిలెండ‌ర్లు పేలి భారీ మంట‌లు అలుముకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి వ‌ల‌స వ‌చ్చిన కార్మికులు జ‌గిత్యాల ర‌హ‌దారిలోని సుభాష్‌న‌గ‌ర్లో పూరిళ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారంతా మంగ‌ళ‌వారం మేడారం జాత‌ర‌కు వెళ్లారు. ప్ర‌మాద సమ‌యంలో ఎవ్వ‌రూ లేక‌పోవడంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రగ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.