అట‌వి, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట‌ట్టిన‌ కొండా సురేఖ

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర అట‌వి, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వ‌న్య‌ప్రాణుల దాడుల్లో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైల్‌పై ఆమె తొలి సంత‌కం చేశారు. ప్ర‌స్తుతం ఇస్తున్న రూ. 5ల‌క్ష‌ల ప‌రిహారాన్ని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచుతూ ఆమె ఆదివారం తొలి ఫైల్‌పై సంత‌కం చేశారు. అదేవిధంగా మ‌రోఫైల్.. ఉత్స‌వాల‌కు ఏనుగుల‌ను ఇత‌ర రాష్ట్రాల నుండి తెచ్చుకొనేందుకు అనుమ‌తిని ఇస్తున్న‌ట్లు మ‌రో సంత‌కం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ప‌లువురు ఎమ్మెల్యేలు ,నేత‌లు, అట‌వి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

 

Leave A Reply

Your email address will not be published.