రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ములుగు జిల్లా వాసులు మృతి
ప్రమాదానికి గురైన అయ్యప్ప భక్తుల వాహనం
చెన్నై (CLiC2NEWS): తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దిండిగల్ వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు ములుగు జిల్లాలోని కమలాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు.