సోదరుడిగా రాఖీ కానుక.. ఎపి డిప్యూటి సిఎం
పిఠాపురం (CLiC2NEWS): రాఖీ పండుగ సందర్భంగా 1500 మంది వితంతు మహిళలకు ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మహిళలకు తన కానుకను అందజేయాల్సిందిగా అక్కడి జనసైనికులను కోరారు. తాను నియోజకవర్గానికి శాసనసభ్యుడిగాగానే కాకుండా ఒక సోదరుడిగా ఉన్నాననే భరోసా కల్పించాలని.. వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపేలా ఈ కార్యక్రమం చేపట్టాలని జనసైనికులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చీరలను పంపిణీ చేశారు. రక్షాబంధన్ కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: ఆ వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి
[…] సోదరుడిగా రాఖీ కానుక.. ఎపి డిప్యూటి… […]