టిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..
రేపు అధికారిక ప్రకటన
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టి అభ్యర్థల పేర్లను ఖరారు చేసింది. 12 మంది అభ్యర్థుల పేర్లను సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఏడుగురు కొత్తవారికి స్థానం కల్పించారు. ఎంపికైన అభ్యర్థులు రేపు, ఎల్లుండి నామినేషన్లు దాఖలు చేస్తారు. మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది.
ఎమ్మెల్సి అభ్యర్థులు వీరే..
ఆదిలాబాద్ నుండి దండే విఠల్
కరీంనగర్ నుండి ఎల్.రమణ, భానుప్రసాద్రావు
ఖమ్మం నుండి తాతా మధు
మహబూబ్నగర్ నుండి సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి నుండి శంభీపూర్రాజు, పట్నం మహేందర్రెడ్డి
వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
నల్గొండ నుండి ఎంసి కోటిరెడ్డి
మెదక్ నుండి యాదవరెడ్డి
నిజామాబాద్ కల్వకుంట్ల కవిత లేదా ఆకుల కవిత