తెలంగాణ‌లో గ్రూప్‌-1 పోస్టుల‌కు కొత్త నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల‌కు తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌లైంది. గ‌త ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేసి.. తాజాగా కొత్త నోటిఫికేష‌న్‌ను టిఎస్‌పిఎస్‌సి విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు ఈ నెల 23వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసిన అభ్య‌ర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని టిఎస్‌పిఎస్‌సి స్ప‌ష్టం చేసింది. అయితే వారికి ఫీజు మిన‌హాయింపు క‌ల్పించ‌నున్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమిన‌రి ప‌రీక్ష మేజూన్‌లో , సెప్టెంబ‌ర్‌/అక‌్అక్టోబ‌ర్‌లో మెయిన్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తుల్లో ఎటువంటి పొర‌పాట్లు ఉన్నా మార్చి 23 ఉద‌యం 10 గంట‌ల నుండి 27 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స‌రిచేసుకోవ‌చ్చు. ప‌రీక్ష స‌మాయానికి ఏడు రోజుల ముందు నుండి హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.