కోర్టులు, ట్రైబ్యునళ్లలో ఆగ‌స్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షిక ప్రత్యక్ష విచారణ

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణ‌యించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆన్​లైన్​ ద్వారా విచారణలు జరుగుతుండగా. ఆగ‌స్టు 9 నుంచి సెప్టెంబ‌రు 9 వ తేదీ వ‌ర‌కు పాక్షికంగా కేసుల ప్ర‌త్య‌క్ష విచార‌ణ చేప‌ట్టాల‌ని ఉన్న‌త న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌తి రోజూ ఒక ధ‌ర్మాస‌నం, ఒక సింగిల్ బెంచ్ ప్ర‌త్య‌క్ష విచార‌ణ చెప‌ట్టాల‌ని సూచించింది.

ఈ మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లలో పాక్షిక ప్రత్యక్ష విచారణ చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది. సెప్టెంబర్ 9వరకు ఈ విధానంలో విచారణ ఉంటుందని పేర్కొంది. ప్రతి రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్​ బెంచ్​ ప్రత్యక్ష విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా హైకోర్టులో ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ కొనసాగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆగస్టు 8వరకు ఆన్‌లైన్‌లో విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

వ్యాక్సిన్ వేసుకున్న న్యాయ‌వాదులు మాత్ర‌మే విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం తెలిపింది. వాదించాల్సిన కేసులు ఉన్న న్యాయ‌వాదులు మాత్ర‌మే విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. కోర్టుల్లో న్యాయవాదులు, సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.