శబరిమలకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్(CLiC2NEWS) : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబరు 17వ తేదీ నుండి నడపనున్నట్టు తెలిపారు. 07109 నంబరు గల రైలు సికింద్రాబాద్ నుండి కొల్లాం స్టేషన్ వరకు, 07110 నంబరు గల రైలు డిసెంబరు 19న కొల్లాం నుండి సికింద్రాబాద్కు నడపనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ డిసెంబరు 10వ తేదీ ఉదయం 8గంటల నుండి ప్రారంభమవుతుందని తెలియజేశారు.