గాజుల అలంక‌ర‌ణలో బాల‌త్రిపుర సుంద‌రి అమ్మ‌వారు

5.20 ల‌క్ష‌ల గాజుల‌తో అలంక‌ర‌ణ

శ్రీ‌కాకుళం (CLiC2NEWS): శ్రావ‌ణ‌మాసం మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన మాసం . ఈ మాసంలో ప్ర‌తి శుక్ర‌వారం మ‌హిళ‌లు ఎంతో శ్ర‌ద్ధ‌గా అమ్మ‌వారికి పూజలు చేస్తారు. అందులోనూ పౌర్ణ‌మికి ముందు వ‌చ్చే శ్రావ‌ణ శుక్ర‌వారం రోజున వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఆచ‌రిస్తారు. ఈ మాసంలో ఏ ఇంట చూసినా పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది. ఆల‌యాలల్లో సైతం అలంక‌ర‌ణలు చేస్తారు. అమ్మ‌వారి ఆల‌యాలైతే వివిధ ర‌కాలుగా అలంక‌రిస్తారు. రూపాయ‌ల నోట్ల‌తో, కూర‌గాయ‌ల‌తో, గాజుల‌తో.. వివిధ రకాల వ‌స్తువుల‌తో ప్ర‌త్యేకంగా అలంక‌రిస్తారు. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా బ‌ల‌గ‌లోని శ్రీ బాల త్రిపుర సుంద‌రీ దేవీ అమ్మ‌వారిని గాజుల‌తో అలంక‌రించారు. సుమారు 5.20 ల‌క్ష‌ల గాజుల‌ను ఈ అలంక‌ర‌ణ‌కు ఉప‌యోగించారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భారీగా భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఆల‌యంలో మ‌హిళ‌లు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తాలు ఆచ‌రించారు.

1 Comment
  1. […] గాజుల అలంక‌ర‌ణలో బాల‌త్రిపుర సుంద‌ర… […]

Leave A Reply

Your email address will not be published.