ఆంధ్ర ప్రీమియ‌ర్ లీగ్ ట్రోఫి ఆవిష్క‌ర‌ణ‌

విశాఖ‌ప‌ట్ట‌ణం (CLiC2NEWS): విశాఖ‌లో ఆంధ్ర ప్రీమియ‌ర్ లీగ్ -4 (APL -4) ట్రోఫీ ని ఆవిష్క‌రించారు. విశాఖ ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియంలో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ఎపిఎల్-4 ట్రోఫినీ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్రముఖ న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్ హాజ‌ర‌య్యారు. ఎంపిలు కేశినేని చిన్ని, శ్రీ భ‌ర‌త్, భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మాజి కెప్టెన్ మిథాలి రాజ్.. ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌లో పాల్గొన్నారు. ఈ ఎపిఎల్-4 సీజ‌న్‌లో మొత్తం 7 జట్లు పాల్గొంటాయి. ఏడు జ‌ట్లు 25 మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి.

 

Also Read: గాజుల అలంక‌ర‌ణలో బాల‌త్రిపుర సుంద‌రి అమ్మ‌వారు

Leave A Reply

Your email address will not be published.