రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసిన న్యాయ‌స్థానం..!

ఢిల్లీ (CLiC2NEWS): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష‌ను  సూర‌త్ కోర్టు ఖ‌రారు చేసింది. మోదీ ఇంటి పేరుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌ని.. ప‌రువు న‌ష్టం కేసులో రాహుల్ గాంధీకి సూర‌త్ కోర్టు జైలు శిక్ష‌ను విధించింది. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా రాహుల్ గాంధీ.. క‌ర్ణాట‌క‌లోని కోలార్‌లో మోదీ ఇంటిపేరు ఉన్న‌వారంద‌రూ దొంగ‌లని వ్యాఖ్యానించారని గుజ‌రాత్ బిజెపి ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూర‌త్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. కోర్టులో రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని వినిపించినా.. అలా అన‌లేద‌ని కోర్టుకు తెలిపినా న్యాయ‌స్థానం ఐపిసి సెక్ష‌న్ 499, 500 ప్ర‌కారం రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఇంకా రాహుల్ అభ్య‌ర్థ‌న మేర‌కు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది. ఈ మేర‌కు శిక్ష‌ను 30 రోజుల పాటు నిలుపుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.