డ్రగ్స్ తీసుకునే నటులపై నిషేధం.. దిల్రాజు
హైదరాబాద్ (CLiC2NEWS): ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే బహిష్కరించబడతారని ఎఫ్డిసి ఛైర్మన్ , సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇటీవల మలయాళ సిని పరిశ్రమలో ఓ నిర్ణయం తీసుకున్నారని.. అక్కడ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లయితే , ఇండస్ల్రీ నుండి బహిష్కరిస్తారు. అలాంటిది ఇక్కడ జరిగిందని తెలిస్తే.. వారిని ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా నిషేధించాలి. అప్పుడే సమాజానికి సందేశం అందుతుంది. పరిశ్రమలోని పెద్దలతో మాట్లాడి తెలుగు సినిమాలోనూ పాటించేలా చేస్తామన్నారు. ఇది మన కర్తవ్యం.. డ్రగ్స్ లేని రాష్ట్రంలగా మార్చడానికి మనమంతా ప్రతిజ్ఞ చేయాలని దిల్ రాజు అన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తదితరలు పాల్గొన్నారు.