రాష్ర్టంలో లాక్‌డౌన్ విధించం: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్: క‌రోనా నేప‌థ్యంలో తాత్కాలికంగానే విద్యాసంస్థ‌లు మూసివేశామ‌ని, తొంద‌ర‌ప‌డి లాక్‌డౌన్ పెట్ట‌బోమ‌ని తెలంగాణ సిఎం కెసిఆర్ స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీలో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ‌కు సిఎం కెసిఆర్ స‌మాధానం ఇచ్చారు. లాక్‌డౌన్ అనేది పెట్టం. ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌దు. ఇప్ప‌టికే చాలా దెబ్బ‌తిన్నాం. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించొచ్చు. బాధ‌తోనే స్కూళ్ల‌ను మూసివేశాం అని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యాసంస్థ‌ల‌ను తాత్కాలికంగానే మూసివేశామ‌న్న విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గ్ర‌హించాల‌న్నారు.
క‌రోనా విష‌యంలో మ‌న రాష్ర్ట ప్ర‌భుత్వం భేష్‌గా ఉంది. టెస్టుల సంఖ్య‌ను పెంచాం. నిన్న ఒక్క‌రోజే 70 వేలు టెస్టులు చేశారు. పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థ‌ల‌కు తాత్కాలికంగా సెల‌వులు ప్ర‌క‌టించాం. సినిమా థియేట‌ర్ల యాజమాన్యాల‌కు కొన్ని వెసులుబాట్లు క‌ల్పించి… కేంద్రం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా థియేట‌ర్ల‌ను ఓపెన్ చేశాం. క‌రోనా వ‌ల్ల మ‌నం ఒక్క‌రం కాదు.. ప్ర‌పంచం దేశం కూడా చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంది. క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌కుండా తెలంగాణ స‌హా యావ‌త్ ప్ర‌పంచాన్ని వేధిస్తోంద‌న్నారు. 10.85 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ ఇచ్చాం. వ్యాక్సిన్ ఇచ్చే అంశం కేంద్రం ప‌రిధిలో ఉంది. డోసుల త‌యారీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ర్టాల‌కు స‌మానంగా పంపిణీ చేస్తోందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.