తెలంగాణలో వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వైద్య విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్తనందించింది. మెడికోలకు స్టైఫండ్ 15శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనం ప్రభుత్వం పెంచింది. తాజాగా పెంపుతో ఇంటర్న్లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభిస్తుంది. పిజి డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032.. సెకండ్ ఇయర్లో రూ.70,757 అందనుంది. ఫైనల్ ఇయర్లో రూ.74,782 గౌరవ వేతనం ఇవ్వనున్నారు.