కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు: జగన్ను అభినందించిన చిరు

హైద‌రాబాద్‌: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి విమానాశ్ర‌యంగా నామ‌క‌ర‌ణం చేశారు.
ఈ సంద‌ర్భంగా సిఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నామని సీఎం జగన్ ప్రకటించారు. గాంధీ, వల్లభా భాయ్ పటేల్ ల కంటే ముందుగానే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి, ప్రజల తరపున పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడితేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

జగన్ను అభినందించిన చిరు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూల్ ఎయిర్‌పోర్ట్ కు పెట్ట‌డం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. గౌరవనీయులైన ముఖ్య‌మంత్రి జగన్ గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’ అని చిరంజీవి ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.