ఎపిలో కొత్తగా 1,730 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,730 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,07,676 కు చేరింది. వీటిలో 8,90,137 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 10,300 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,239 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు బులిటెన్లో వెల్లడించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.