వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఖానాపురం (CLiC2NEWS): వరంగల్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఖానాపురం మండలం ఆశోక్నగర్ శివారు దూసముద్రం చెరువు కట్టపై అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఒకే కుటుంబానికి చెందిన వారు ట్రాక్టర్లో నర్సంపేట వెళ్తుండగా ఈ ప్రమాద జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు నర్సంపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరంతా పెళ్లికి సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేయడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.