Sangareddy: ఎస్‌బి ఆర్గానిక్ ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

హ‌త్నూర (CLiC2NEWS): సంగారెడ్డి జిల్లా హ‌త్నూర మండ‌లం చందాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఆర్గానిక్ ప‌రిశ్ర‌మ‌లో బుధ‌వారం సాయంత్రం పేలుడు సంభ‌వించింది. ప‌రిశ్ర‌మ‌లోని బాయిల‌ర్ పేలి భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. పేలుడు ధాటికి భ‌వ‌నాలు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో ప‌రిశ్ర‌మ డైరెక్ట‌ర్ ర‌వితో స‌హా మ‌రో న‌లుగురు కార్మికులు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మృతులు సంఖ్య పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్లు భావిస్తున్నారు. ప‌లువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌లు ఆర్పేప్ర‌య‌త్నం చేస్తున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.