ఓ టైల‌రింగ్ దుకాణంలో అగ్నిప్ర‌మాదం..

ముగ్గురు మ‌హిళ‌లు, ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఏడుగురు మృతి

ముంబ‌యి (CLiC2NEWS):  మ‌హారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బుధ‌వారం ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ టైల‌రింగ్ దుకాణంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మ‌హిళ‌లు , ఇద్ద‌రు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్ల‌డించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకునొ మంట‌లు అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.