జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, జలమండలి అధికారులతో పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ బుధవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్, పురపాలక తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ మధ్య హైదరాబాద్లో కురిసి భారీ వర్షాలు, వరదల తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, ముంపు బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై మంత్రి ఈ భేటీలో అధికారులతో చర్చించారు. వరద బాధితులకు రేపటి వరకు సాయం అందుతుందని అధికారులు ఈ సమావేశంలో మంత్రికి తెలిపారు.