లండ‌న్‌లో రోడ్డు ప్ర‌మాదం.. భార‌త విద్యార్థిని మృతి

London:  లండ‌న్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో భార‌త్‌కు చెందిన పిహెచ్‌డి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. భార‌త్‌కు చెందిన చేష్టా కొచ్చ‌ర్ లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో పిహెచ్‌డి చేస్తున్నారు. గ‌తంలో ఆమె నీతి అయోగ్‌కు సంబంధించిన ఓ ప్రాజెక్టు కోసం ప‌నిచేశారు. బిహేవియ‌ర‌ల్ సైన్స్ పిహెచ్‌డి చేయ‌డానికి లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌క వెళ్లారు. సైక్లింగ్ చేస్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదానికి గురై చేష్టా కొచ్చర్ మృతి చెందినట్లు .. నీతి అయోగ్ మాజి సిఇఒ అమితాబ్ కాంత్ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

గురుగ్రామ్‌లో నివాస‌ముండే చేష్టా కొచ్చ‌ర్‌.. సెప్టెంబ‌ర్‌లోనే పిహెచ్‌డి కోసం లండ‌న్ వెళ్లారు. 2021-23 మ‌ధ్య నీతి ఆయోగ్‌లోని నేష‌న‌ల్ బిహేవియ‌ర‌ల్ ఇన్‌సైట్స్ యూనిట్‌లో సీనియ‌ర్ స‌ల‌హాదారుగా సేవ‌లందించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఆమె భ‌ర్త, కొంత దూరంలోనే ఉన్న‌ట్లు స‌మాచారం. ఆసుప‌త్రికి త‌ర‌లించే స‌రికే మృతి చెందారు. ఆమె తండ్రి లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ ఎస్‌పి కొచ్చ‌ర్ (రిటైర్డ్) లండ‌న్‌కు చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.