AP Corona: కొత్తగా 2,665 కేసులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,677 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,665 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిలెన్ విడుదల చేసింది.
- ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,22,843 పెరిగింది.
- తాజాగా కరోనాబారిన పడి 16 మంది మృతిచెందారు.
- ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13,002 మంది మృతిచెందారు.
- 24 గంటల్లో 3,231 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
- రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం రికవరీ కేసులు 18,81,161 చేరింది.
- ప్రస్తుతం 28,680 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.
