AP: డివైడర్ ను ఢీకొన్న కారు.. ముగ్గురి దుర్మరణం
బాపట్ల (): ఎపిలోని బాపట్ల జిల్లా మార్జూరు మండలం కోలలపూడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుక్కు తప్పించబోయి డివైడర్ను ఢీకొన్న కారు… ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మృతులు లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25) గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరింతా తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read: కెఎ పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు