ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన ఇసుక‌లో శ‌వం..

చీరాల (CLiC2NEWS): బాప‌ట్ల జిల్లా చీరాల మండ‌లం ఈవూరుపాలెంలో ఓ ఇంటి నిర్మాణం కోసం ఇసుక‌ను తెప్పించారు. దానిలో శ‌వం బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. దీంతో ఇంటి యజ‌మానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పద్మ‌నాభంపేట‌లో ఉన్న కాగితాల ల‌క్ష్మి ఇంటి నిర్మాణం కోసం ఇసుక తోలించారు. కూలీలు ఇసుక‌ను తీస్తుండ‌గా.. అందులో శ‌వం బ‌య‌ట‌ప‌డింది. ఈ విష‌యాన్ని ఇంటి య‌జ‌మానురాలికి తెల‌ప‌గా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని రెండు రోజుల క్రిత‌మే పూడ్చిపెట్టి ఉంటార‌ని భావిస్తున్నారు. పోస్టు మార్టం అనంత‌రం మృత‌దేహాన్ని చీరాల ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.