క‌న్న‌బిడ్డ‌ల‌ను హ‌త‌మార్చిన దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌!

గార్ల (CLiC2NEWS): గ‌త నెల‌లో త‌మ కుమార్తెలకు పాల‌ల్లో విషం క‌లిపి ఇచ్చి హ‌త్య చేసిన దంప‌తులు నేడు అడ‌వి ప్రాంతంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త నెల 10వ తేదీన‌ మ‌హబూబాబాద్ జిల్లా గార్ల మండ‌లంలోని అంకన్న గూడేనికి చెందిన అనిల్‌, దేవిలు త‌మ కుమార్తెల‌ను హ‌త్య‌చేసి ప‌రారైన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అప్ప‌టి నుండి వారు ప‌రారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం అంక‌న్న గూడెం స‌మీపంలోని అడ‌విలో వీరిద్దరి మృత దేహాలు ల‌భ్య‌మ‌యిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.