టికెట్ రాలేద‌ని ఈ రోడ్ ఎంపి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

చికిత్స పొందుతూ క‌న్నుమూత‌

కోయంబ‌త్తూర్‌ (CLiC2NEWS): లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌లేద‌ని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన ఈ రోడ్ ఎంపి, ఎండిఎంకె నేత గ‌ణేశ‌మూర్తి క‌న్నుమూశారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈరోడ్ స్థానం నుండి గ‌ణేశ్‌మూర్తి ఎంపిగా ఎన్నిక‌య్యారు. అయితే.. ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్దుబాట్ల కార‌ణంగా ఈ సారి టికెట్ ద‌క్క‌లేదు. దీంతో మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. కోయంబ‌త్తూర్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. 1993 లో ఎండిఎంకే ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుండి ఇదే పార్టీలో కొన‌సాగారు.

ఈ సారి ఈరోడ్ నుండి ఎండిఎంకె కు తిరుచ్చి కేటాయించారు. అక్క‌డి నుండి దురైవైగోను పార్టీ త‌మ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.